తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..నుజ్జు నుజ్జయిన కారు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..నుజ్జు నుజ్జయిన కారు

తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. అలిపిరి చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడ దాటి చెట్టును ఢీకొట్టింది. ఈ సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో నలుగురు భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.   చెట్టుకు కారు బలంగా  ఢీకొనడంతో దాని ముందుభాగం నుజ్జు నుజ్జయింది.  

ALSO READ:బక్రీద్ 2023.. 7 రుచికరమైన మటన్ వంటకాలు..తింటే అదుర్సే

బెంగుళూరుకు చెందిన వినయ్.. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో తిరుపతికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ  ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని స్థానిక రుయా ఆసుపత్రికి తరలించారు.