
తిరుమలలో శ్రీవారి దర్శనం సెప్టెంబర్ కోటా విడుదల తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. 21న కళ్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత సేవా టికెట్లు, 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ కోటా టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
- జూన్21: ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదల
- జూన్21: మధ్యాహ్నం 3 గంగలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా ఆన్లైన్లో విడుదల
- జూన్23 : ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు
- జూన్23 : ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
- జూన్ 23: మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ప్రత్యేక దర్శనం కోటా విడుదల
- జూన్ 24 : ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
- జూన్ 24 : మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాఆన్లైన్లో విడుదల
- జూన్ 25 : ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాటీటీడీ ఆన్లైన్లో విడుదల
- జూన్ 25 : మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్ వైజర్ల సేవల ఆగస్టు నెల కోటా విడుదల