ట్రక్కులో ఇరుక్కుపోయిన  డ్రైవర్.. కాపాడిన ట్రాఫిక్ పోలీసులు..తిరుమలగిరి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం

ట్రక్కులో ఇరుక్కుపోయిన  డ్రైవర్.. కాపాడిన ట్రాఫిక్ పోలీసులు..తిరుమలగిరి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం

పద్మారావునగర్, వెలుగు: తిరుమలగిరి చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిని రక్షించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రెండు మినీ ట్రక్కులు ఢీకొనడంతో ఓ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్‌‌‌‌‌‌‌‌రాజు సిబ్బంది గణపతి, కనకయ్యలతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్​ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు.