జాతీయ స్థాయి పోటీలకు విశ్వభారతి స్టూడెంట్స్

జాతీయ స్థాయి పోటీలకు విశ్వభారతి స్టూడెంట్స్

గద్వాల, వెలుగు: జాతీయస్థాయి క్రికెట్, ఫుట్ బాల్ పోటీలకు విశ్వ భారతి స్టూడెంట్స్ ఎంపికైనట్లు ఆ స్కూల్ యాజమాన్యం త్యాగరాజు, తిరుమలేశ్​ తెలిపారు. అండర్- 17 క్రికెట్లో సిద్ధార్థ సెలెక్ట్ అయ్యారని ఈనెల 16  నుంచి 20  వరకు పాట్నా లో    జాతీయ స్థాయి పోటీలో  పాల్గొంటున్నారన్నారు.

అలాగే అండర్ -14 ఫుట్ బాల్ విభాగంలో విశ్వభారతి స్కూల్ కు చెందిన అక్షయ్ సెలెక్ట్ అయ్యాడని ఈనెల 17 నుంచి 21 వరకు రాంచీలో జరిగే పోటీలో పాల్గొంటారన్నారు. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ను ప్రిన్సిపల్, కరస్పాండెంట్, డి వై ఎస్ ఓ ఆనందు, క్రికెట్ కోచ్ శీను, ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్ రాములు వారిని అభినందించారు.