ములుగు/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఐడీఓసీ ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ రాహుల్శర్మ ప్రజల నుంచి 70 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. జనగామలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించగా, వివిధ సమస్యలపై 232 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ములుగు గ్రీవెన్స్లో 96 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు.
గ్రీవెన్స్ అనంతరం ఆయన హెచ్పీ గ్యాస్ గోదాంను తనిఖీ చేసి, సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వరంగల్ ప్రజావాణిలో 165 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ సత్యశారద చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 70 ఫిర్యాదులు అందాయని అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
