హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలైనా చెల్లించాలని, లేదంటే ఒక్కొక్కరికి రూ.50 వేల బోనస్ అయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి హన్మంతు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆదివారం బతుకమ్మ, సోమవారం దసరా పండుగ ఉన్నందున ఒక రోజు ముందే బోనస్ఇచ్చేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలివ్వాలని ఆయన సీఎంను కోరారు.
కార్మికులకు ఏటా చెల్లించాల్సిన దసరా, క్రిస్మస్, రంజాన్ అడ్వాన్స్ రూ.4,500 కొన్నేండ్లుగా చెల్లించడమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు లక్ష చొప్పున బోనస్ ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అందులో సగమైన ఇవ్వాలని కోరుతున్నామని హన్మంతు చెప్పారు.
రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ పిల్లలకు పండుగ పూట కొత్త బట్టలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆకలి బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి హన్మంతు విజ్ఞప్తి చేశారు.