
హైదరాబాద్, వెలుగు: సిటీలో చేపట్టిన షేక్పేట్, ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యాయి. వాటిని ఈ నెలాఖరులో ప్రారంభించాల్సి ఉండగా.. అందుకు మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం అధికారులు వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రూ. 333.55 కోట్ల అంచనాతో షేక్పేట్ ఫ్లై ఓవర్ పనులను 2018లో ప్రారంభించారు. 6 లేన్లతో 2.8 కి.మీ ఉన్న ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే రేతిబౌలి నుంచి గచ్చిబౌలి మధ్యలో ట్రాఫిక్ తగ్గుతుంది. 3 లేన్ల ఓవైసీ ఫ్లై ఓవర్ పనులను రూ. 63 కోట్ల అంచనాతో 2018లోనే ప్రారంభించారు. 1.4 కి.మీ మిథాని జంక్షన్ నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు ఉన్న ఈ ఫ్లైవర్ అందుబాటులోకి వస్తే కర్మన్ ఘాట్, సంతోశ్నగర్, మిథాని, చాంద్రాయణ గుట్ట రూట్లలో ట్రాఫిక్ తగ్గనుంది