
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. ఆదివారం ఒక్క వికారాబాద్ జిల్లాలోనే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారికంగా తెలిపారు. వికారాబాద్ లో 10, తాండూరులో ఒక కేసు నమోదైనట్లు చెప్పారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరాయన్నారు.
దీంతో ప్రజలు లాక్ డౌన్ పాటిస్తూ.. కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు జిల్లా కలెక్టర్. అటు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ నమోదైనట్లు జిల్లాకు చెందిన వైద్యార్థికారులు తెలిపారు.