సూర్య‌పేట‌ జిల్లాలో మ‌రో 16 : ఒకే ఫ్యామిలీలో 14

సూర్య‌పేట‌ జిల్లాలో మ‌రో 16 : ఒకే ఫ్యామిలీలో 14

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో క‌రోనా మళ్లీ విజృంభించింది. బుధ‌వారం ఒక్క రోజు కాస్త త‌గ్గిన పాజిటివ్ కేసులు గురువారం పెరిగాయి. రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 50 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్ ప్రెస్ మీట్ లో తెలుపగా.. ఇందులో ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 16 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు అధికారులు.

సూర్యాపేటలో 14, మండలాల్లో 2 కరోనా కేసులు న‌మోదుకాగా.. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరిందన్నారు. అయితే సూర్యాపేట‌లో న‌మోదైన 14 కేసులు కూడా ఒకే ప్యామిలీకి చెందిన వారుగా సమాచారం. దీంతో మరింత అప్రమత్తమైన అధికారులు.. పాజిటివ్‌ అని తేలిన వారితో దగ్గరగా ఉన్న వారిని గుర్తించి క్వారెంటైన్ కు పంపేందుకు చర్యలు చేబడుతున్నారని తెలుస్తుంది.