
హైదరాబాద్ – రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు శనివారం కూడా 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని శనివారం రాత్రి 9 గంటలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరింది. ప్రస్తుతం 605 మంది బాధితులు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చికిత్స పొందుతుండగా.. కరోనా నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
43 కరోనా కేసుల వివరాలు
హైదరాబాద్-31
గద్వాల్- 07
సిరిసిల్ల- 02
రంగారెడ్డి-02
నల్గొండ-01