ఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. 24 గంటల్లో నమోదైన కేసులకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఆరోగ్యశాఖ.. ఇవాళ 41 మంది డశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 54కి చేరిందని చెప్పింది.  తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2452కి చేరిందని..  ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉండగా.. 1680 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ.