
హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్. గురువారం సాయంత్రం కరోనాపై మాట్లాడిన ఆయన..పాజిటివ్ కేసులు ఒకరోజు పెరుగుతుంటే.. మరో రోజు తగ్గుతున్నాయన్నారు. పాజిటివ్ కేసులకు సంబంధించి ఆందోళన వద్దని తెలిపారు. తాజాగా నమోదైన 50కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 700కి చేరాయన్నారు. 186 మంది డిశ్చార్జ్ కాగా.. 18 మంది చనిపోయారన్నారు. మిగతావారికి ట్రీట్ మెంట్ జరుగుతుందన్న మంత్రి.. రాష్ట్రంలో 5 వేల కరోనా టెస్టులు చేసే సామర్ద్యం రానుందన్నారు.
గచ్చిబౌలి హాస్పిటల్ లో 1500 బెడ్స్ పెంచాలని నిర్ణయించామని తెలిపిన మంత్రి.. ఈ హాస్పిటల్ ను ఈ నెల 20న ప్రారంభిస్తామని తెలిపారు. డబ్బుల కోసం ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సిన అవసరంలేదని.. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని , డబ్బులు బ్యాంకుల్లో భద్రంగా ఉంటాయన్నారు. 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు సమకూరుస్తున్నామని, అన్ని సెంటర్లకు వీటిని అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ల్యాబ్స్ లో పరీక్షలు జరుగుతున్నాయన్నాయని తెలిపిన మంత్రి .. ఇవాళ 68 మంది డిశ్చార్జి కాబోతున్నారని తెలిపారు.