
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు శుక్రవారం కూడా భారీగానే నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. ప్రస్తుతం 562 మంది బాధితులు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చికిత్స పొందుతుండగా.. కరోనా నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.