మాస్ ఎలివేషన్స్కి కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ. ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుంచి మరో మాస్ ఎంటర్టైనర్ వస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ హీరోయిన్. ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో నిన్న ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ‘నెరిసిన గడ్డం, నల్ల చొక్కా, మెడలో రుద్రాక్షమాల, నోట్లో చుట్ట, చేతిలో గొడ్డలితో ఓ మైలురాయిపై కూర్చున్నాడు బాలకృష్ణ. పులిచర్ల నాలుగు కిలోమీటర్లు అని దానిపై రాసుంది. వెనుక కెమికల్ ఇండస్ట్రీకి స్వాగతం అంటూ ఓ ఆర్చ్, దానికి గాయాలతో వేలాడుతున్న రౌడీలు. ‘నరకడం మొదలు పెడితే... ఏ పార్ట్ ఎవరిదో కూడా తెలియదు’ అంటూ తన మార్క్ మాస్ డైలాగ్ చెబుతున్నారు బాలకృష్ణ. సీన్ కట్ చేస్తే ఓ గవర్నమెంట్ ఆఫీసులో కూర్చున్న బాలయ్య... ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్... నా జీవో గాడ్స్ ఆర్డర్’ అని ఎవరినో హెచ్చరిస్తున్నారు. మరోవైపు సామూహిక వివాహాలు జరుగుతున్న ఓ పెళ్లిమండపం. అందరూ చేతులెత్తి ఆయనకు మొక్కుతున్నారు. ‘భయం నా బయోడేటాలోనే లేదురా’ అంటూ పెళ్లికొడుకుల గెటప్లో ఉన్న రౌడీలను చితక్కొడుతున్నారాయన. బాలయ్య గెటప్ మొదలు, డైలాగ్స్ వరకూ ప్రతి ఫ్రేమ్లో మాస్ ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. తమన్ మరోసారి బ్యాగ్రౌండ్ స్కోర్లో తన మార్క్ చూపించాడు. కన్నడ హీరో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్స్ గా నటిస్తున్నారు. చంద్రికా రవి స్పెషల్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్లో ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు బాలకృష్ణ. వీ.ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి.జీవన్ రెడ్డి దర్శకత్వం
వహిస్తున్నాడు.