ఇవాళ (అక్టోబర్ 16న) జనగాం, భువనగిరికి కేసీఆర్​..

ఇవాళ (అక్టోబర్ 16న) జనగాం, భువనగిరికి కేసీఆర్​..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ మరింత ఉధృతం చేస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 16న) జనగామ, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. 

జనగామలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని సీఎం కేసీఆర్ అభ్యర్థించనున్నారు. జనగామలోని మెడికల్‌ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 

ఇటు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ కోసం బీఆర్‌ఎస్‌ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా జనగామలోని సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. జనగామ సభ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్‌ భువనగిరి పట్టణంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లనున్నారు. 

వేదికను, సభా ప్రాంగణంతోపాటు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రెయిన్‌ ప్రూఫ్‌ స్టేజీ వేశారు. రెండో చోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.