అర్థరాత్రి ప్రధాని వారనాసిలో నడిరోడ్డుపై తిరుగుతూ

అర్థరాత్రి ప్రధాని వారనాసిలో నడిరోడ్డుపై తిరుగుతూ

ప్రధాని మోదీ గుజరాత్ లో తన పర్యటన ముగించుకోని నిన్న రాత్రి 11గంటలకు వారనాసి చేరుకున్నారు. తన సొంత నియోజకర్గమైన వారనాసిలో  ఈ రోజు ఆయన  పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో బహిరంగ సభ తర్వాత నేరుగా అక్కడికి చేరుకున్నారు. వారనాసి ఏయిర్ పోర్ట్ నుంచి లక్నో, అజాంఘర్ ఘజిపూర్ వెళ్లే రోడ్డు మార్గాన్ని నేడు ప్రారంభించనున్నారు. 

రాత్రి 11 గంటలకు శివపూర్-  -ఫుల్వారియా  లహర్తారా రహదారిని సీఎం యోగి ఆదిత్యానాథ్ తో కలిసి  పరిశీలించారు. మోదీ రాకతో అక్కడి జనం బయటకు వచ్చి కేరింతలు వేశారు. ప్రధాని వారికి అభివాదం చేశారు. రూ.360 కోట్లతో నిర్మించిన ఈ రహదారి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి విమానాశ్రయానికి సులభంగా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. దీని నిర్మాణాన్ని అంత రాత్రి వేళలో మోదీ పర్యవేక్షించారు.