బషీర్ బాగ్, వెలుగు: సిటీకి చెందిన 50 ఏళ్ల మహిళకు ముంబై పోలీసులమని సైబర్ క్రిమినల్స్ కొరియర్ పేరిట ఫోన్ చేసి మోసగించారు. తైవాన్ సిటీ నుంచి ఫెడెక్స్ పార్సిల్ ముంబైకి వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని, తాము చెప్పినట్లు చేయకపోతే వెంటనే అరెస్ట్ చేయిస్తామని ఆమెను బెదిరించారు. మరోసారి వీడియో కాల్ చేసి.. సైబర్ క్రైమ్ పోలీసులమంటూ ఆమె బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలు జరిగాయని, వెంటనే వెరిఫై చేయాలని బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ను తీసుకున్నారు.
ఆమె అనంతరం క్రిమినల్స్ చెప్పిన విధంగా రూ. 1.11 లక్షలను చీటర్స్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. మోసపోయానని బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.