సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న స్టార్స్

 సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న స్టార్స్

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. కరెంట్ అప్ డేట్స్, వైరల్ న్యూస్, డెయిలీ న్యూస్.. ఇలా ఏం తెలుసుకోవాలన్నా చాలా మంది సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు.  ఇక సెలబ్రెటీల విషయానికొస్తే.. పర్సనల్ టూర్స్, డెయిలీ ఈవెంట్స్ ను పంచుకుంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మిలియన్లలో ఫాలోవర్స్.. చెప్పలేనంత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. కానీ మరికొందరు నటులు మాత్రం మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు. కారణం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాతో పెరిగిపోతున్న  ఇబ్బందులేనని పలువురు స్టార్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రైవేటుగా ఉంచడానికే ఇష్టపడుతున్నారు.

రణ్ బీర్ కపూర్

రణ్ బీర్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఆయన భార్య ఆలియా భట్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ చేసుకుంటూ ఉంటుంది. అంతే కాదు కొన్ని సార్లు రణ్ బీర్ కు సంబంధించిన ఈవెంట్లను, అప్ డేట్ లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.

సైఫ్ అలీ ఖాన్

సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న వాళ్లలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. ఈయన కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులూ చేయరు. ఆలియా లాగానే తన భార్య కరీనా కపూరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

రాణీ ముఖర్జీ

ఇక రాణీ ముఖర్జీ విషయానికొస్తే ఆమె కూడా సైఫ్ అలీఖాన్, రణ్ బీర్ బాటలోనే పయనిస్తున్నారు. అప్పటి హీరోయిన్లు శిల్పాశెట్టి, కాజోల్, సుస్మితా సేన్ లాంటి వాళ్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుండగా.. రాణీ ముఖర్జీ మాత్రం సోషల్ మీడియా తప్పనిసరేం కాదని భావిస్తుండడం గమనార్హం.

రేఖ

అప్పటి హీరోయిన్లు కొందరు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే తమ అందం, అభినయంతో ఒకప్పుడు అలరించిన కొందరు హీరోయిన్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్లలో ఉండే హీరోయిన్ రేఖ. ఆమె కూడా తనకు సంబంధించిన విషయాలను ప్రైవేటుగానే ఉంచుతారు.

నయనతార

ఇటీవలే వివాహం చేసుకొని, సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లయిన లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సోషల్ మీడియాకు ఆమడ దూరంలోనే ఉంటారు. ఆమె పెళ్లి జరిగినపుడు కూడా తమ ఫొటోలను ఆమె భర్త విఘ్నేషే సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ పిల్లల విషయాన్ని కూడా ఆయనే వెల్లడించారు. కానీ నయన్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను లేకపోవడం చెప్పుకోదగిన విషయం.