
- మోడీ బహిరంగ సభకు అగ్రనేతల కసరత్తు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో బీజేపీ అగ్ర నేతలు పర్యటించనున్నారు. జులై3 న ప్రధాని మోడీ బహిరంగ సభ కారణంగా ముఖ్య నేతలు కార్యకర్తలతో భేటీ అవ్వనున్నారు.త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ కుమార్ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. బోథ్ లో మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జయదేవకర్, నిర్మల్ లో బీహార్ ఎంపీ నంద కిషోర్ పర్యటిస్తారు. అలాగే బైంసాలో కర్నాల్ రాజ్ వర్థన్ సింగ్ రాథోడ్, ఖానాపూర్ లో మహారాష్ట్ర ఎంపీ హీన విజయ కుమార్ గౌటే, ఆసిఫాబాద్ లో గుజరాత్ ఎంపీ దిపిస్ సొండెల్ పర్యటిస్తారు.రేపు సిర్పూర్ లో మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే , ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పర్యటించనున్నారు.