కిషన్‌ రెడ్డి దమ్మున్న నాయకుడు కాదు.. నా వల్లే ప్రమోషన్

కిషన్‌ రెడ్డి దమ్మున్న నాయకుడు కాదు.. నా వల్లే ప్రమోషన్

హైదరాబాద్: సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో తన వల్లే ప్రమోషన్ వచ్చిందని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రేవంత్ మీడియాతో చిట్‌ చాట్ చేశారు. తనకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రావడం వల్లే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా వచ్చిందన్నారు. ‘కిషన్ రెడ్డి దమ్మున్న నాయకుడు కాదు.. వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించడానికి వెళ్తే కనీసం ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కూడా రాలేదు’ అని చెప్పారు. ఎన్డీయే సర్కార్‌‌లో తెలుగు ప్రజలపై చిన్న చూపు చూస్తున్నారని, అందుకే కేంద్ర మంత్రి పదవులు ఇవ్వలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో 10 మంది కేంద్ర మంత్రులయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్ సర్కారు మళ్లీ ముందస్తు ఎన్నికలే వస్తాయని, 2023 మొదట్లోనే ముందుగా సర్కారును రద్దు చేసి, కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని రేవంత్ అన్నారు.