టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్తాం

టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్తాం

సిద్ధిపేట వద్ద NSUI స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై  సిద్దిపేట పోలీస్ కమీషనర్ తో రేవంత్ ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతుందని..ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారిని పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం టీఆర్ఎస్ పాలకుల పాశవికత్వానికి నిదర్శనమన్నారు. మానవత్వం లేకుండా వెంకట్ పైన పోలీసుల దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారని రేవంత్ తెలిపారు. పాలకులు ఇలాగే పాశవికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెప్తామని రేవంత్ హెచ్చరించారు.