సర్పంచులను అప్పులపాలు చేసిన్రు..నవాబుపేట

సర్పంచులను అప్పులపాలు చేసిన్రు..నవాబుపేట

రెండో రోజుకు ప్రజాహిత పాదయాత్ర 

నవాబుపేట, వెలుగు : గ్రామాల్లోని సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అప్పుపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్​దేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని హన్మసాన్​పల్లి, కూచూరు, దొడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, ఇప్పటూరు గ్రామాల్లో ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట జనాలను మోసం చేస్తున్నారన్నారు. రిజర్వాయర్ల పేరుతో కమీషన్ల దందా చేస్తూ, బాధితులను ఆదుకోవడం లేదని విమర్శించారు. గ్రామాలను డెవలప్​ చేస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలకు నిధులు కేటాయించకుండా, బిల్లులు చెల్లించకుండా తిప్పలు పెడుతున్నారన్నారు.

ఉద్యోగాలు లేక విద్యావంతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్​ చేసి చూపిస్తానని తెలిపారు. రబ్బాని, వాసుయాదవ్​,సేవాదళ్​​నాయకులు వాజిద్  మహేక్, హమీద్​ మహేక్, బంక వెంకటయ్య, తుల్సీరాం నాయక్, కూచూరు వెంకటయ్య, మీనాక్షి పాల్గొన్నారు.