24న పీసీసీ పీఏసీ మీటింగ్‌కు హాజరుకానున్న సీఎం రేవంత్

24న పీసీసీ పీఏసీ మీటింగ్‌కు హాజరుకానున్న సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ( పీఏసీ ) మీటింగ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో జరగనుంది. పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్నారు. 

లోకల్ బాడీ ఎన్నికలతో పాటు రాజకీయ పరమైన కీలక అంశాలపై ఈ మీటింగ్ లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత పీసీసీ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. కొత్తగా నియమితులైన పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం కూడా జరుగుతుంది.