నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి

నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలి : జగ్గారెడ్డి

దుబ్బాక, వెలుగు: మెదక్​కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నీలం మధుకు మద్దతుగా రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్​ఎంపీగా నీలం మధు గెలిస్తేనే ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయని, బీజేపీ, బీఆర్ఎస్​అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటుందన్నారు. ఆగస్ట్​15లోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్​అభ్యర్థి గెలిస్తేనే దుబ్బాక ప్రాంతం సుభిక్షింగా ఉంటుందన్నారు. ఎంపీగా పదేళ్లు పని చేసిన కొత్త ప్రభాకర్​రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క పైసా తీసుకరాలేదన్నారు. మూడేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు దుబ్బాకకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్​రెడ్డి, నాయకుడు మోహన్​ రెడ్డి పాల్గొన్నారు.