హైదరాబాద్ కు రాష్ట్రపతి .. బొల్లారంలో ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్ కు  రాష్ట్రపతి ..  బొల్లారంలో ట్రాఫిక్​ ఆంక్షలు

కంటోన్మెంట్, వెలుగు: రాష్ర్టపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా బొల్లా రంలోని రాష్ర్టపతి నిలయానికి వస్తున్న నేపథ్యంలో సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 గంటల మధ్య హకీంపేట ఎయిర్​ ఫోర్స్  స్టేషన్​ వై -జంక్షన్, బొల్లారం చెక్ ​పోస్ట్,  నేవీ జంక్షన్, యాప్రాల్​రోడ్​, హెలీప్యాడ్​ జంక్షన్, బైసన్ ​గేట్, లోతు కుంట టీ -జంక్షన్​ ప్రాంతాల్లో ట్రాఫిక్​ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఉంటుందన్నారు.  ఈ సమయంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా  వెళ్లాలని  పోలీసులు సూచించారు.