
కంటోన్మెంట్, వెలుగు: రాష్ర్టపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా బొల్లా రంలోని రాష్ర్టపతి నిలయానికి వస్తున్న నేపథ్యంలో సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 గంటల మధ్య హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై -జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్రోడ్, హెలీప్యాడ్ జంక్షన్, బైసన్ గేట్, లోతు కుంట టీ -జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఉంటుందన్నారు. ఈ సమయంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.