- ఐకియా జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడర్లో ట్రాఫిక్జామ్స్తో ఉద్యోగులు రోజూ నరకం చూస్తున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్నుంచి ఐకియా, సైబర్ టవర్స్ మీదుగా జేఎన్టీయూ వైపు రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐకియా రొటరీ చుట్టూ రోడ్డును వెడల్పు చేశారు. ఇక నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా జంక్షన్మీదుగా సైబర్టవర్స్వైపు వెళ్లే వాహనదారులు ఐకియా అండర్పాస్ నుంచి వెళ్లాలి.
బయోడైవర్సిటీ జంక్షన్నుంచి ఐకియా జంక్షన్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులు ఐకియా రోటరీ వద్ద రైట్ టర్న్తీసుకొని యాంటీ క్లాక్వైజ్డైరెక్షన్లో కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి. ఇదే రూట్లో కేబుల్బ్రిడ్జి వైపు వెళ్లాలనుకునే వాహనదారులు ఐకియా రోటరీ వద్ద యూటర్న్తీసుకొని ఐకియా ఫ్లైఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ మీదుగా ఐకియా వైపు వెళ్లే వాహనదారులు ఐకియా రోటరీ వద్ద యూటర్న్తీసుకోవాలి. కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వెహికల్స్రోటరీ వద్ద ఫ్రీ లెఫ్ట్తీసుకొని కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి.
సైబర్టవర్స్నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లే వెహికల్స్ఐకియా అండర్ పాస్నుంచి బయో డైవర్సిటీ వైపు వెళ్లాలి. మీనాక్షి జంక్షన్నుంచి బయోడైవర్సిటీ వైపు వెళ్లే వాహనాలు ఐకియా రోటరీ వద్దకు చేరుకొని సీ గేట్వద్ద యూటర్న్తీసుకొని వెళ్లాలి. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు, ఉద్యోగులు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్జాయింట్ సీపీ జోయల్డేవిస్ కోరారు. ఈ నెల 22 వరకు డైవర్షన్స్ అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.