హసన్ పర్తి: సాగునీటి కోసం రోడ్డు రైతులు ఎక్కారు. కమలాపూర్ మండలం శంభునిపల్లి అంబాల, శనిగరం, పెరికపల్లి, మాదన్నపేట, లక్ష్మీపురం, నేరెళ్ల, గూడూరు గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు ఇవాళ హసన్ పర్తి మండలం అనంతసాగర్ జాతీయ రహదారి పై బైఠాయించి ఆందోళన చేశారు. ఎస్సారెస్పీ నీటిని వాగులోకు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటలకు నీటిని విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, నీటిపారుదల శాఖ ఆఫీసర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ధర్నాతో హసన్ పర్తి-, కరీంనగర్ జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు చర్యలు చేపడతామని రైతులకు హసన్ పర్తి సీఐ సురేశ్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.
ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- కరీంనగర్
- March 4, 2024
లేటెస్ట్
- పవర్లో ఉన్న పార్టీకే మానుకోట జై.!
- లైఫ్, హెల్త్, యాక్సిడెంట్ కవరేజ్.. పాలసీ ధర రూ.1,500!
- ఢిల్లీ పాంచ్.. ముంబై సిక్స్.. ఐపీఎల్లో క్యాపిటల్స్కు ఐదో విజయం
- ఓటింగ్ టైమ్ పెంచండి.. ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
- వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...
- ప్రజలు మళ్లీ మోసపోవద్దు.. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు : కేటీఆర్
- పెండింగ్ సీఎంఆర్పై సర్కారు సీరియస్
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్ : సీఎం రేవంత్రెడ్డి
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వంశీకృష్ణ
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది