
హైదరాబాద్ లో సోమవారం( డిసెంబర్ 18) ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ కు వస్తున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నియలానికి బస చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రయాణించే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా వై జంక్షన్ , బొల్లారం జంక్షన్ , నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకంట జంక్షన్ వైపు మీదకు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు వేరే మార్గాల్లో గమ్యస్థానాలను చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.