ప్రధాని పర్యటన నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

ప్రధాని పర్యటన నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
  • 1500 మంది పోలీసులతో బందోబస్తు

సికింద్రాబాద్, వెలుగు: ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శనివారం సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు బీజేపీ నాయకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం, టీఆర్ఎస్ నాయకులు నిరసనల నేపథ్యంలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 

బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి అమీర్​పేట మీదుగా  పోలీసులను మోహరించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బేగంపేట, పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాశ్ నగర్ -జంక్షన్​, రసూల్​పురా జంక్షన్​, సీటీవో జంక్షన్, సోమాజిగూడ మోనప్ప ఐల్యాండ్,రాజ్​భవన్​ రోడ్​,  ఖైరతాబాద్ జంక్షన్ రూట్లలో ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. వాహనదారులు ఇతర రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.