
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్ యాక్సిడెంట్స్ నివారణ, రూల్స్ గురించి పోలీసులు ప్రచారం చేసేవారు. ఇప్పుడు కరోనా ప్రికాషన్స్ వినిపిస్తున్నారు. సిటీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్, ఆటో స్టాండ్స్, కూరగాయల మార్కెట్ల వద్ద మైకులతో సేఫ్టీ ప్రికాషన్స్ అనౌన్స్ చేస్తున్నారు. 2 నిమిషాలపాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో ఆడియో మెసేజ్ వినిపిస్తున్నారు. వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే 60 జంక్షన్లలో ప్రతి చోటా 4 మైక్ లు ఏర్పాటు చేసి.. ఫేస్ మాస్క్లు, ఫిజికల్ డిస్టెన్సింగ్, హైజెనిక్ ఫుడ్, కరోనా సింప్టమ్స్ తదితర అంశాలపై అవేర్నెస్ కల్పిస్తున్నారు. వెహికల్ మూవ్ మెంట్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో టైమ్తో కూడిన షెడ్యూల్ ఫిక్స్ చేశారు.