నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

నాంపల్లి, వెలుగు: నేడు నగరానికి భారతఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపిన సమాచారం మేరకు బుధవారం ఉపరాష్ట్రపతి ఉదయం 9 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంకు చేరుకుంటారు. బేగంపేట్ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, రాజ్ భవన్, వీవీస్టాట్యూ , ఎన్టీఆర్ మార్గ్ , ఇక్బాల్ మినార్,రవీంద్ర భారతి, నాంపల్లి మీదుగా రాజ్ భవన్ కు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వెళ్లను న్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్నుంచి మధ్యాహ్నం 12:25 గంటలకు తిరిగి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకోనున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఆసమయంలో ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్  మల్లింపు ఉంటుందని గ్రహించి మరోమార్గాన్ ని ఎంచుకోవాలి ట్రాఫిక్ పోలీసులుసూచించారు.