సదాశివపేటలో పండగ పూట విషాదం

సదాశివపేటలో పండగ పూట విషాదం

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పండగ పూట విషాదం నెలకొంది. సీఐ మహేశ్​తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని వికారాబాద్​ రోడ్డులో ఉన్న సెయింట్అంథోని స్కూల్​గేటు ముందు ఆగి ఉన్న  ఓ ప్రైవేటు బస్సు కింద శుక్రవారం హైదరాబాద్​ సూరారం కాలనీ, తిరుమలగిరికి చెందిన షేక్​ఖాదిర్​( 34) పడుకున్నాడు. 

అతడు పడుకున్నది బస్సు డ్రైవర్​ గమనించకుండా బస్సును తీయడంతో సదరు వ్యక్తి ​తలపై నుంచి టైర్​ వెళ్లి అక్కడికక్కడే చనిపోయాడు. మృతి చెందిన వ్యక్తి  జేబులో ఆధార్​ కార్డు మాత్రమే ఉందని, హైదరాబాద్​ నుంచి సదాశివపేటకు ఎందుకు వచ్చాడన్నది దర్యాప్తులో తెలుస్తుందన్నారు. కేసు నమోదు చేసుకొని డెడ్​బాడీని గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించామని సీఐ తెలిపారు.