వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి

వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి

కుత్బుల్లాపూర్: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో చనిపోయింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలోని రెండున్నరేళ్ల దీపాలి శుక్రవారం సాయంత్రం ఆరుబయట ఆడుకుంటుంది. ఆ సమయంలో చిన్నారిని వీధి కుక్కలు కరిచి, తీవ్రంగా గాయపరిచాయి. పాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం (ఏప్రిల్ 13)న దీపాలి మృతి చెందింది. ఈ ఘటన చిన్నారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.