గన్​ మిస్​ ఫైర్ కావడంతో లక్ష్మాపూర్​లో విషాదం

గన్​ మిస్​ ఫైర్ కావడంతో లక్ష్మాపూర్​లో విషాదం

అచ్చంపేట, వెలుగు: హైదరాబాద్​ హుస్సేని ఆలం పోలీస్​స్టేషన్​లో గన్​ మిస్​ ఫైర్​ కావడంతో ఏఆర్​ ఏఎస్ఐగా పని చేస్తున్న పిట్టల బాలీశ్వరయ్య(48) చనిపోగా, ఆయన సొంత గ్రామమైన అచ్చంపేట మండలం లక్ష్మాపూర్​లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు రాములమ్మ , బాల్​నారి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు, బంధువులు ఏఎస్ఐ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.