ప్రేమ పెళ్లి.. ఆపై కట్నం వేధింపులు.. గంటల్లోనే వాళ్లిద్దరూ మృతి

ప్రేమ పెళ్లి.. ఆపై కట్నం వేధింపులు.. గంటల్లోనే వాళ్లిద్దరూ మృతి

అవును.. వాళ్లిద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు..  ఆ తర్వాత ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.  ఇది జరిగి రెండేళ్లు అవుతుంది. ప్రేమ ప్రేమే.. పెళ్లి పెళ్లే అన్నట్లు.. అమ్మాయికి కట్నం వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆ అమ్మాయి పురుగుల మందు తాగి చనిపోగా.. అమ్మాయి తరపు వారి దాడిలో.. ఆ అబ్బాయి(భర్త) చనిపోయాడు.. ఒకరికి ఒకరిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గంటల వ్యవధిలోనే ఒకటిగా చనిపోవటం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగర్ కర్నూల్ జిల్లాలో  వరకట్న వేధింపులతో భార్య సూసైడ్​ చేసుకోగా, భార్య తరపు బంధువుల దాడిలో భర్త మృతి చెందాడు. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సింధు, ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున రెండు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అచ్చంపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నాగార్జున పని చేస్తున్నారు. కొద్ది రోజులుగాకట్నం తీసుకోరావాలని సింధును  నాగార్జున వేధిస్తున్నాడు. దీంతో జనవరి 12వ తేదీ..  శుక్రవారం సింధు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.  చికిత్స కోసం ఆమెను నాగర్ కర్నూల్ హాస్పిటల్ కు.. అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మధ్యలో మృతి చెందింది. 

సింధు మరణంలో ఆమె కుటుంబ సభ్యులు.. భర్త నాగార్జునపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. మా అమ్మాయి చావునకు కారణం నువ్వే.. ప్రేమించావు.. పెళ్లి చేసుకున్నావు.. కట్నం కోసం వేధించావు.. నీది నిజమైన ప్రేమ కాదు అంటూ తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో జరిగిన ఘర్షనలో భర్త నాగార్జున చనిపోయాడు.  సింధు డెడ్​బాడీ అచ్చంపేట హాస్పిటల్ లో ఉండగా.. నాగార్జున మృతదేహం కల్వకుర్తి హాస్పిటల్ లో ఉంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.