ఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు

ఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు

మహబూబాబాద్ జిల్లాల్లో దారుణం జరిగింది. గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 10) ఇద్దరు చిన్నారులు అనుమానస్పదంగా మృతి చెందారు. కందగట్ల అనిల్, దేవి దంపతుల కుమార్తెలు లాస్య (2), లోహిత (2నెలలు) చనిపోయారు. మృతుల తల్లిదండ్రులు అనిల్, దేవి  పరారీలో ఉండటం ఆశ్చార్యానికి గురి చేస్తుంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యభర్తల మధ్య గొడవల వల్లే అభంశుభం తెలియని చిన్నారులను విషం ఇచ్చి చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పిల్లల మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ALSO READ :- తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ఇదే