కూకట్ పల్లి సెలూన్ లో.. గడ్డం గీసే కత్తితోనే హత్య చేశారు

కూకట్ పల్లి సెలూన్ లో.. గడ్డం గీసే కత్తితోనే హత్య చేశారు

హైదరాబాద్​ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ని దుండగులు హత్య చేశారు. అనంతరం సెలూన్​ లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, పారిపోయారు. పాపారాయుడు నగర్లో ఈ ఘటన కలకలం రేపింది. 

రాత్రి అయినా అశోక్​ ఇంటికి వెళ్లకపోవడంతో ఆయన భార్య, పిల్లలు కంగారు పడ్డారు. తెలిసిన వాళ్లను వాకబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో నేరుగా హర్ష లుక్స్​ సెలూన్​ కు వెళ్లారు. షాపులో రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి ఆయన భార్య షాక్​ కు గురయ్యారు. విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి పిల్లలు బోరున విలపించారు.

విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును చాలా సీరియస్​ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అశోక్ దగ్గర పని చేసిన యువకుడే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.