మహారాష్ట్రలో రైలు ప్రమాదం .. 14 మంది మృతి

మహారాష్ట్రలో రైలు ప్రమాదం .. 14 మంది మృతి

ట్రాక్ పై పడుకున్న వలసకూలీలపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్ ట్రైన్

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ పై నిద్రిస్తున్న వలసకూలీల మీది నుంచి గూడ్స్ రైలు వెళ్లడంతో 14 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 6:30గంటలకు ఔరంగాబాద్-జాల్నా స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ ఘడ్ వెళ్తున్న వలసకూలీలుగా గుర్తించారు. లాక్డౌన్ వల్ల తమ స్వస్థలాలకు వెళ్లడానికి వాహనాలు లేక ట్రాక్ పై నుంచి నడుచుకుంటూ కొంతమంది వలస కూలీలు చత్తీస్ ఘడ్ వెళ్తున్నారు. వారు ఔరంగాబాద్ దగ్గరకు చేరుకోగానే రాత్రి కావడంతో వారంతా ట్రాక్ పైనే పడుకున్నారు. లాక్డౌన్ కదా.. రైళ్లు ఏవీ రావు అని అనుకోవడమే వారు చేసిన తప్పు. ఆ నిర్లక్ష్యానికి 14 మంది ప్రాణాలు కొల్పోయారు.