రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు, వ్యూస్, లైకులు, ఫాలోవర్స్ కోసం యువత ఇప్పుడు వింత పోకడలు, వెర్రి చేష్టలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. రోడ్లపై డ్యాన్సులు, ట్రాఫిక్ మధ్యలో వీడియోలు తీయడం,మరికొందరు రైలు పట్టాలపై, వంతెనలపై, ఎత్తైన భవనాల పైకప్పులపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఒడిశాలోని పూరిలో రైలు పట్టాలపై రీల్స్ చేస్తూ టీనేజర్ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది.
రైల్వే బ్రిడ్జిపై రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొని పూరికి చెందిన 15 ఏళ్ల టీనేజర్ చనిపోయాడు. పూరి పట్టణ సమీపంలోని మంగ్లాఘాట్ కు చెందిన బిశ్వజిత్ సాహు.. మంగళవారం సాయంత్రి సమీపంలోని రైల్వే బిడ్జిపై రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అతని శరీర భాగాలు తునాతునకలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
A 15-year-old boy died after being hit by a train while he was filming a reel on a railway track in Odisha’s Puri.
— SK Chakraborty (@sanjoychakra) October 23, 2025
The incident occurred at the Janakdevpur railway station on Tuesday.
Vishwajeet Sahu, a resident of Mangalaghat, visited the Dakshinkali temple with his mother.
On… pic.twitter.com/tWouD4LQTM
వైరల్ అవుతున్న వీడియోలో టీనేజర్ బిశ్వజిత్ సాహు రైలు ఢీకొనడంతో ట్రాక్ పై పడిపోయినట్లు కనిపిస్తోంది. ఘటన తర్వాత కూడా కెమెరా రికార్డింగ్ ఆన్ లోనే ఉండటంతో తర్వాత కూడా దృశ్యాలు రికార్డయ్యాయి. రైలు దాటిన తర్వాత అతని స్నేహితుల్లో ఒకరు అతని వైపు పరుగెత్తుకుంటూ వచ్చి అతని పేరు 'సాహు... సాహు' అని పిలిచారు కానీ అతను స్పందించలేదు. అప్పటికే సాహు మృతిచెందాడు. ఈ ఘటనలో మరో టీనేజర్ కూడా గాయపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఒడిశా రైల్వే పోలీసులు ..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం తరలించారు.
రీల్స్ పిచ్చిలో ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టడం ఇదే మొదటిసారి కాదు.. రీల్స్ చేస్తూ చాలా సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
