తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ లో మార్చి 2 వరకు 10 రోజుల పాటు పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులను జరగనున్నాయి. శిక్షణ శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, వైఎస్ షర్మిల, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 75 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణలో పాల్గోననున్నారు. ఫిబ్రవరి 23న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ హజరుకానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా వికారాబాద్ అనంతగిరి చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
ఖర్గే, రాహుల్ వచ్చే చాన్స్!
డీసీసీ అధ్యక్షులకు జాతీయ స్థాయిలో సర్, మన్రోగా వంటి పలు అంశాలపై, రాష్ట్రంలోని పలు విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శిక్షణా తరగతులు పార్టీ అంతర్గత కార్యక్రమంలో భాగమని, అందుకే కవరేజీకి మీడియాను అనుమతించడం లేదని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
►ALSO READ | చంచల్ గూడ జైలులో ఉగ్ర కుట్ర జరగలే.. ఆ వార్తలన్నీ ఫేక్: జైల్ డీఐజీ శ్రీనివాస్
