గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 మంది ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఇటీవల సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మియాపూర్ పీఎస్ ఇన్ స్పెక్టర్గా సైబారాబాద్ వీఆర్లో పనిచేస్తున్న రామలింగ ప్రసాద్ను నియమిస్తూ సీపీ అవినాష్మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు మరో 9 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీలు జరిగాయి.