
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి భారీగా పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. మూడు రోజుల కిందట 77 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది.
ఈ మేరకు ఇందుకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీసీ ఉండటం గమనర్హం.
వరుస ట్రాన్స్ఫర్లు సంబంధిత ఉద్యోగులతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.