తెలంగాణలోని కలెక్టర్లు, ఎస్పీలపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, వరంగల్, నిజామబాద్ పోలీసు కమిషనర్లు, రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది.
2023 అక్టోబర్ 12 గురువారం సాయంత్రం 5గంటల కల్లా ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
- ALSO READ | అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి కిషన్రెడ్డి