పెండ్లికి ఒప్పుకోలేదని చంపింది

పెండ్లికి ఒప్పుకోలేదని చంపింది
  •     అంజలీ హత్య కేసులో ట్రాన్స్​జెండర్​ మహేశ్వరి అరెస్టు

కోల్​బెల్ట్​,వెలుగు: మందమర్రి మండలం గుడిపెల్లి అటవీప్రాంతంలో యువతి సల్లూరి అంజలిని హత్య చేసిన పెరుగు గున్నక్క అలియాస్​ మహేశ్వరిని మంగళవారం రామకృష్ణాపూర్​ పోలీసులు అరెస్టు చేశారు.  మందమర్రి సీఐ మహేందర్​రెడ్డి, రామకృష్ణాపూర్​ టౌన్​ ఎస్సై బి.అశోక్​ వివరాలు వెల్లడించారు.  మామిడిగట్టు గ్రామానికి చెందిన అంజలి, నెన్నెల మండలం మన్నెగూడకు చెందిన పెరుగు మహేశ్వరి రెండేండ్లుగా మంచిర్యాలలోని విద్యానగర్​లో ఒకే రూమ్​లో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి మగవాళ్లలా వ్యవవహరించిన ట్రాన్స్​ జెండర్​ మహేశ్వరి  కొద్దికాలంగా అంజలిని ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుందామంటూ  ఒత్తిడి తేగా, ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి వద్దని,  దోస్తులుగా ఉందామనడంతో  తరచూ ఇద్దరు గొడవపడేవారు. వీరి  రూమ్​కు మహేశ్వరి స్నేహితుడు ఆజ్మీర శ్రీనివాస్ తరచూ వచ్చేవాడు. అంజలి, శ్రీనివాస్​ మధ్య చనువు పెరిగింది. తాను  శ్రీనివాస్​ను పెండ్లి చేసుకుంటానని  అంజలి  చెప్పడంతో కోపం పెంచుకున్న మహేశ్వరి ఆమెను  చంపాలని  నిర్ణయించుకుంది.   ఈ నెల 15న రాత్రి   తన  బైక్​పై   గుడిపెల్లి గ్రామం వైపు తీసుకవెళ్లింది. రాత్రి 10 గంటలకు మహేశ్వరి తనతో తెచ్చుకున్న  కత్తితో  అంజలిపై  దాడి చేసి చంపింది.   తనపై అనుమానం రాకుండా  అదే కత్తితో గొంతు, కడుపులో పొడుచు కుందని సీఐ మహేందర్​రెడ్డి, ఎస్ఐ అశోక్​ తెలిపారు.