శామీర్పేట, వెలుగు : వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమల్లోకి తీసుకొస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో మేడ్చల్ జిల్లా తూంకుంట వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
తూంకుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన మూడ్రోజులకే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని.. 100 రోజుల్లో మిగతావి అమల్లోకి తెస్తామన్నారు.