నాసిరకం విత్తనాలతో మోసపోయామని గిరిజన రైతుల ఆందోళన

నాసిరకం విత్తనాలతో మోసపోయామని  గిరిజన రైతుల ఆందోళన
  • ఎరువుల షాపు ఎదుట పురుగుల మందు డబ్బాలతో నిరసన 
  • భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో ధర్నా 

ములకలపల్లి, వెలుగు : నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని, న్యాయం చేయాలని కొందరు గిరిజన రైతులు ఎరువుల షాపు ఎదుట పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. ములకలపల్లి మండలం తాళ్లపాయ గిరిజన రైతులు యాసంగిలో వరి సాగుకోసం ములకలపల్లికి చెందిన బాలాజీ ఫెర్టిలైజర్​అండ్ ఫెస్టిసైడ్స్ లో విత్తనపు వడ్లు కొన్నారు. అదును కంటే ముందే వరి ఈనింది. పొలమంతా తాలు కంకులు వచ్చాయి. 

దీంతో వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దుకాణ యాజమాని, విత్తన కంపెనీలు రైతులదే తప్పు అని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి చస్తామంటూ ఫర్టిలైజర్​షాపు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న ఏవో కరుణామయి అక్కడికి వచ్చి షాపులోని రికార్డులు పరిశీలించారు. 15 రోజులపాటు అమ్మకాలు నిర్వహించవద్దని ఆదేశించారు. ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.