పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్లీ చిరంజీవికి జంటగా నటిస్తోంది త్రిష. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది.
సోమవారం త్రిష షూటింగ్లో జాయిన్ అయింది. చిరంజీవి బొకేతో ఆమెకు వెల్కమ్ చెప్పారు. ‘స్టాలిన్’లో చిరంజీవితో కలిసి నటించిన త్రిష, ‘ఆచార్య’లో నటించాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్తో తప్పుకున్నట్టు అప్పట్లో అనౌన్స్ చేసిన ఆమె, ఇప్పుడు ‘విశ్వంభర’లో తిరిగి కలిసి నటిస్తోంది.