గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటి త్రిష

గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటి త్రిష

హీరోయిన్ త్రిష కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ వీసా అందుకున్నమొదటి తమిళనటిగా త్రిష రికార్డ్  సాధించారు. 

2019 నుంచి UAE ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేస్తోంది. ఈ వీసా కలిగినవారు UAEలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్‌ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని 5 లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక అవి వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. అయితే త్రిషకి ఇకపై ఇండియాతో పాటు UAEలో కూడా ఉండొవచ్చు.

ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నవారిలో...ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ సింగర్  కేఎస్ చిత్ర ఉన్నారు.