ఇరవై ఏళ్ల తర్వాత సూర్యతో జత కట్టనున్న త్రిష .. కమెడియన్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లో కరుప్పు..

 ఇరవై ఏళ్ల తర్వాత సూర్యతో జత కట్టనున్న త్రిష ..  కమెడియన్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లో  కరుప్పు..

డిఫరెంట్ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుంటూ  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. వీటిలో  కోలీవుడ్ కమెడియన్‌‌‌‌ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘సూర్య 45’ వర్కింగ్ టైటిల్‌‌‌‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  శుక్రవారం (June 20) ఆర్జే బాలాజీ పుట్టినరోజు  సందర్భంగా ఈ మూవీ టైటిల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఈ చిత్రానికి ‘కరుప్పు’ అనే టైటిల్‌‌‌‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా కనిపిస్తోంది. చేతిలో కత్తి పట్టుకుని, అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా సూర్య ముఖాన్ని నీడలో చూపిస్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్‌‌‌‌ డ్రాప్‌‌‌‌లో ఈ చిత్రం రూపొందుతోందని, ఇందులో  సూర్య  వైల్డ్  పాత్రలో కనిపిస్తాడని  ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత సూర్య, త్రిష జోడీ ఇందులో నటిస్తున్నారు. ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌ఆర్ ప్రకాష్, ఎస్‌‌‌‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.  

చిన్న ప్యాచ్‌‌‌‌వర్క్ మినహా షూట్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం  పోస్ట్- ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. మరోవైపు  తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ సూర్య  హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా  జరుగుతోంది.