తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో రూ. 2100 కోట్ల పెట్టుబడి పెట్టాలని ట్రైటాన్ ఈవీ (TRITON EV) కంపెనీ నిర్ణయించింది. జహీరాబాద్ నిమ్జ్‌లో తన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తొలి ఐదేళ్లలో సుమారు 50వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీనికి సంబంధించిన ఎంవోయూ మీద కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వం సంతకాలు చేశాయి. తమ పెట్టుబడి కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని కేటీఆర్  ఆశాభావం వ్యక్తం చేశారు.